* * *
నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు- అందుకని చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి వాడి స్నేహితులు. ఇక చదవండి…
* * *
అర్థ రాత్రి అవుతుండగా బిట్టుకి మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ నిద్రలో ఉన్నారు. వరండాలోకి వెళ్లి చప్పుడు చేయకుండా చూసాడు… రెయిన్బో కనిపించలేదు! “ఏమయ్యాడు వాడు?” అని ఒక్క నిముషం ఖంగారు పడినా, లోపలికి వచ్చి చూస్తే తాతయ్య మంచం క్రింద మరింత ముడుచుకుని పడుకుని ఉన్నాడు వాడు.

ఇంతలో ఎవరో దగ్గిన శబ్దం వినిపించింది బిట్టుకి. అందరివైపు చూసాడు. ఎవరూ కదల్లేదు.
తాతమ్మ గదిలోకి వెళ్లి చూసి వచ్చాడు. ఆవిడ నిద్రపోతోంది.. అంతలోనే మళ్ళీ శబ్దం వచ్చింది…బయట వాన శబ్దంలోంచే.. నిద్రపోతున్నవాళ్లకి వినపడకపోయినా, మెల-కువగా ఉన్న బిట్టుకి తెలుస్తోంది.
శబ్దం ఇంటి ప్రక్కన ఉన్న సందులోంచి వస్తున్నట్లుంది… “ఎవరై ఉంటారు? ఏమి చెయ్యాలి?” అని ఆలోచించాడు. “తాతయ్యని కానీ, అమ్మమ్మని కానీ లేపాలా? తనే చూడాలా? లేక దావీదుని లేపాలా?” అని తేల్చుకోకుండానే టార్చి లైటు వేసి వాకిలి ముందు, పెరటి వైపు చూసాడు. ఎవరూ కనిపించలేదు.
“సందులో సన్ షేడ్ లో ఎవరైనా వచ్చి నిలబడ్డారా? అక్కడ చూడాలంటే తలుపులు…
View original post 555 more words