* * *
అదిగో ద్వారక
డా. చింతకింది శ్రీనివాసరావు
తమ పాలనలో ఉన్న ప్రజలని ఎక్కువ తక్కువ వర్గాలుగా విభజించి, ఆ విభజన బలంతో అదే ప్రజలమీద పెత్తనం చేసే స్వార్థపరులైన అధికారవర్గం, ఆ విభజన వెనుక ఉన్న అసలు తత్త్వం తెలియక తమ అనైక్యతల మధ్య నలుగుతూనే, ఆ అధికారం కింద సతమతమయే ప్రజలు…
ఇదేకదా వర్తమాన ప్రపంచంలో ఎక్కడ చూసినా జరుగుతున్నది. అయితే ఈ వర్తమానానికి పునాదిగా బలమైన చరిత్రే ఉంది. అది మహాభారత కాలంనాటి నుంచి ఉంది. ఇతిహాసమని మనం గౌరవించే మహాభారత కథని క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా అధ్యయనం చేసిన శ్రీ చింతకింది శ్రీనివాసరావుగారు అధ్యయన సమయంలో తనను వేధించిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఈ నవలకు పూనుకున్నారు. దీనికోసం ఆయన ఎంతో పరిశోధన చేసారు. మహాభారత కథ జరిగిందన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, అక్కడి ప్రజలతో ప్రత్యక్షంగా గడిపి తను సేకరించిన వివరాలతో బలమైన కథను రాసారు. ఆ ప్రయత్నంలో మూలకథలోని వాస్తవాలను మాత్రమే తీసుకున్నారు. దానికి ఎలాటి కల్పనలకూ పూనుకోలేదు.
మహాభారత కథలో మనమంతా గొప్ప నాయకులుగా ప్రశంసించే శ్రీకృష్ణుడు, అర్జునుడు జీవిత చరమాంకంలో గిరిజనుల చేతుల్లో పొందిన అనుభవం రచయితలో ఎన్నో ప్రశ్నలు రగిలించింది. గిరిజనుడి బాణం దెబ్బకు కృష్ణుడు కన్నుమూయటం, గిరిజనులపైకి పాశుపతాస్త్రం ఎక్కుపెట్టబోయి అర్జునుడు భంగపడటం ఎందువల్ల జరిగింది? గిరిజనులకు వారిపై ఇంతటి ద్వేషం కలగటానికి కారణమేమిటి?
గిరిజనుడైన ఏకలవ్యుడికి…
View original post 1,094 more words