భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III

ద్వైతాద్వైతం

* * *

Continued from Part II

OLYMPUS DIGITAL CAMERAద్వారకలో రెండురోజుల మజిలీ తర్వాత మేము సోమనాథ్ కి రోడ్దు దారిలో ప్రయాణమయాం. అది దాదాపు 4-5 గంటల ప్రయాణం. దారి పొడవునా విండ్ మిల్స్ దర్శనమిస్తాయి. రాష్ట్రంలో విద్యుత్తును పుష్కలంగా తయారుచేసేందుకు  ఇవి బాగా తోడ్పడుతున్నాయి. రోడ్డు బావుంది. చుట్టూ విశాలమైన ఖాళీ భూములే కాని ఎక్కడా పంట పొలాలు కన్పించకపోవటం గమనార్హం. సోమనాథ్ వెళుతూ మధ్యలో గాంధీజీ జన్మస్థలమైన పోర్బందరు చూసేం.OLYMPUS DIGITAL CAMERAఇక్కడ బాపూ పుట్టిన భవంతిని ‘కృతి మందిర్’ అని అంటారు. దీనిని కొద్ది మార్పుచేర్పులతో అతి భద్రంగా సంరక్షిస్తున్నారు. గాంధీ జన్మించిన గదిలో ఆయన పుట్టిన స్థలంలో ఒక స్వస్తిక్ గుర్తు పెట్టబడి ఉంది. విశాలమైన రెండు అంతస్థుల భవనం అది. బాపు చదువుకున్న గది, ఇప్పటిలా అరుగులు, అల్మరలతో సౌకర్యవంతంగా ఉన్నవంట గది, అతిథులకోసం ఉన్నగదులు, ఇలా అనేక గదులతో ఉన్న చాలా పెద్ద భవంతి అది. వెనుక వైపు సందర్శకులకోసం మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం ఉన్నాయి. ఆ పరిసరాల్ని నిరంతరం శుభ్రపరుస్తూ అక్కడ ఇద్దరు ముగ్గురు యువకులు, స్వచ్చంద సేవకులు కాబోలు కనిపించారు. ఆ భవనాన్ని ఆనుకునే వెనుక వీధిలో కస్తూర్బా తల్లిదండ్రుల ఇల్లు ఉంది. ఆవిడ పుట్టిన గదిని, ఆ భవంతిని శుభ్రంగా సంరక్షిస్తున్నారు. అది కూడా అన్ని సౌకర్యాలతో, అనేక గదులున్న రెండు అంతస్థుల భవంతి .OLYMPUS DIGITAL CAMERAవిజిటర్స్ బుక్…

View original post 1,078 more words

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part II

ద్వైతాద్వైతం

* * *

Continued from Part I

OLYMPUS DIGITAL CAMERA భారత దేశంలో ప్రభుత్వం గుర్తించిన 12 సాంస్కృతిక వారసత్వ నగరాల్లో ద్వారక ఒకటి. ద్వారక అంటే (గేట్ వే) ముఖ ద్వారం. ద్వార్ అంటే ద్వారం, క అంటే బ్రహ్మ. ద్వారక అంటే ‘స్వర్గానికి ముఖ ద్వారము’. ఈ గుడిలో కృష్ణభక్తురాలు మీరాబాయి కృష్ణుడిలో ఐక్యం అయిందని చెబుతారు. ద్వారకలోని ప్రధాన ఆలయం ద్వారకాధీషుడి దేవాలయం. దీనిని ‘జగత్ మందిర్’ లేదా ‘నిజ మందిర్’ అనికూడా అంటారు. అంటే ప్రపంచానికే దేవాలయం. ఇది అతి ప్రాచీన వైష్ణవ ఆలయం. ఈ గుడి మొదటగా 2,500 సంవత్సరాలు క్రితం కట్టబడింది. కాని దండయత్రలతో పూర్తిగా ధ్వంసమైపోయింది. తిరిగి 16వ శతాబ్దంలో కట్టబడింది. 72 స్థంభాల మీద కట్టబడిన ఐదు అంతస్థుల కట్టడం ఇది. ఈ దేవాలయానికి మోక్ష ద్వారమని పిలిచే ముఖ్యద్వారము, స్వర్గద్వారమని పిలిచే మరొక ద్వారము ఉన్నాయి. మోక్షద్వారం గుండా దేవాలయం లోపలికి వెళ్లి, స్వర్గ ద్వారం గుండా బయటకు రావలసి ఉంటుంది. స్వర్గద్వారం నుండి మరొకవైపుగా 56 మెట్లు దిగి గోమతి నది ఒడ్డుకు చేరవచ్చు. ముఖ్యద్వారం నుండి దేవాలయం బయటకు వచ్చినట్లైతే అది పట్టణంలోని మార్కెట్టుకు దారితీస్తుంది.OLYMPUS DIGITAL CAMERAఈ దేవాలయం 256 అడుగుల ఎత్తు కలిగిన నిర్మాణం. ఇది ఈ ప్రాంతాల్లో విస్తారంగా దొరికే సున్నపురాయి, ఇసుకలను ఎక్కువగా ఉపయోగించి నిర్మించబడింది. దేవాలయం శిఖరం పైన సూర్యుడు, చంద్రుడు గుర్తులుగా…

View original post 1,115 more words

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I

ద్వైతాద్వైతం

* * *

IMG-20170529-WA0014

ఇటీవల కాలంలో అంటే దాదాపు గత పదేళ్లుగా మన దేశంలో పర్యాటకం బాగా అభివృధ్ధి చెందుతోంది. దేశంలోని ఏమూల  ఉన్న పర్యాటక ప్రదేశంలోనైనా ఎక్కువగా మన ఆంధ్రా వాళ్లు కనిపిస్తూ ఉంటారని నా ఉత్తరాది స్నేహితురాలు నన్ను ఆట పట్టిస్తోంది కూడా. నిజమే. ఒక కుటుంబంలోని వారో, లేదా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి కొన్ని కుటుంబాలుగానో లేదా ప్రభుత్వ పర్యాటక శాఖ కానీ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్వహించే టూరు ప్రోగ్రాముల్లోకానీ  మన వాళ్లు ఎక్కువగానే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పచ్చు. ఇదివరకటిలా ఉన్న చోటికే పరిమితమవకుండా ఇలాటి యాత్రలు చేస్తున్నారన్నది నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది అభిలషణీయమైన మార్పు. ఎందుకంటే యాత్ర చేసిన వారికి ఎనలేని ప్రపంచానుభవాన్ని అందించటంతో పాటు, ఈ యాత్రలు ప్రభుత్వాలకి, ఆయా ప్రాంతాల్లోని స్థానికులకి ఆదాయాన్ని సంపాదించి పెడతాయి.

ఒక ఉపఖండంగా పిలిచే మనదేశం భిన్న సంస్కృతులకి కూడలి. దేశం గురించిన ఎన్నో వార్తలు, విశేషాలు రేడియో ద్వారానో, టి.వి. లేదా ఇంటర్నెట్ ద్వారానో నిత్యం మనకు తెలుస్తూనే ఉంటాయి. కానీ స్వయంగా చూసి రావడం వలన ఆయా ప్రాంతాల్లోని జీవన వైవిధ్యం తెలుస్తుంది. ప్రపంచం ఒక గ్లోబల్ విలేజీగా మారిపోయిందనుకునే ఈ సమయంలో ఇలాటి పర్యటనలు మరింత అవసరం, సులభం కూడా. వీటి వలన దైనందిన జీవితాల్లోని యాంత్రికతను వదిలించుకోవచ్చు.

ఇప్పుడు వాయవ్య భారతం కబుర్లు చెప్పుకుందాం. యాత్ర గురించిన కబుర్లు మీతో…

View original post 1,093 more words

ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part IV

ద్వైతాద్వైతం

* * *

Continued from Part III

OLYMPUS DIGITAL CAMERA

ప్రొద్దున్న 7.30 నుండి 10.30 వరకూ అనేక జీప్ సఫారిలు సందర్శకుల సంఖ్యను బట్టి వరుసగా బయలుదేరుతాయి. ఏనుగు సఫారి మాత్రం రోజుకు రెందు ట్రిప్ లు . ప్రొద్దున్న 5.15, 6.15  సమయాల్లో బయలుదేరుతాయి. ఒక గంట పాటు ఈ సఫారి  సాగుతుంది. దీనికి చాలా డిమాండ్ ఉంది. ఒక్కో ఏనుగు మీద నలుగురు మాత్రమే ఎక్కే వీలుంది. టికెట్లు దొరకటం కొంచెం కష్టమే. మరుసటి రోజుకి కావాలంటే మాత్రం దొరకవు. ముందుగా వి.ఐ.పి. లకి, విదేశీ సందర్శకులకీ టికెట్లకోటా ప్రకారం అమ్మేస్తారు. మిగిలినవి కూడా అక్కడ కొందరు ముందుగా కొని బ్లాక్ లో అమ్మటం ఉంది. ఒక్కక్కరికి నాలుగు టికెట్లు ఇస్తారు. టికెట్టు ధర 425 రూపాయలు .ఏనుగు సఫారికి వెళ్ళాలంటే రెండురోజులు ముందుగా అక్కడికి చేరటం లేదా ఎవరిద్వారానైనా ముందుగా బుక్ చేసుకోవటం చెయ్యాలి.

OLYMPUS DIGITAL CAMERA

జీప్ సఫారీకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు ఇసుకతో ఎగుడుదిగుడుగా అసౌకర్యంగా అనిపించాయి. వాటిని మరికాస్త సౌకర్యంగా మలచి సఫారీని మరింత సుఖవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది.

జీప్ సఫారీ సమయంలో కళ్ల ఎదుటే రైనోలు తాపీగా నడిచి రోడ్ దాటడం చూసేము. ఈ సఫారీ దాదాపు మూడు గంటల సమయం పట్టింది.

OLYMPUS DIGITAL CAMERA

ఈ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి రెండు నెలల కాలంలో ఇక్కడ 20 రైనోలను పోచర్లు చంపివేసారు. ఇలాటి సంఘటనల వలన…

View original post 536 more words

Conqueror – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, June 2021

* * * Original : Nadella Anuradha Translation: Banda Srinivasarao The other day, while I was checking the homework done by students sitting in the front rows, noticed some commotion from the elder students in the back benches.On completing the home work checking, I reached the back benches to find Sunil in the middle of asmall …

Continue reading Conqueror – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, June 2021

తడి ఆరని సంతకాలు – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jun. 2021

* * *     తడి ఆరని సంతకాలు             ఉత్తేజ పరిచే నిజజీవిత కథలు సుధామూర్తి   ః కథా సంకలనం                 అరుణ పప్పు ః అనువాదం                                           సుధామూర్తికి వివిధ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో, వివిధ వ్యక్తులతో తనకెదురైన అనుభవాలను పాఠకులతో పంచుకోవటం అలవాటు. ఆ అనుభవాలను ఇప్పటికే పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకం కోసం ఆమె కొత్త ఆలోచన చేసారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన కథలను రాయమంటూ పోటీ పెట్టారు. అందులోంచి ఎంపిక …

Continue reading తడి ఆరని సంతకాలు – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jun. 2021

ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part III

ద్వైతాద్వైతం

* * *

Continued from Part II

OLYMPUS DIGITAL CAMERA

షిల్లాంగ్ నుండి 90  కిలోమీటర్ల దూరంలో మాలినాంగ్ అనే చిన్న గ్రామం ఉంది. ఇది 2003 లో ఆసియాలోనే అతి శుభ్రమైన గ్రామం గా, 2005 సంవత్సరంలో భారత దేశంలో అతి శుభ్రమైన గ్రామంగా  పేరుకెక్కింది .ఇది గాడ్స్ ఓన్ గార్డెన్ గా పేరు పొందింది.

OLYMPUS DIGITAL CAMERA

ఇక్కడ రివర్ వ్యాలీ ఇకోపార్క్ 2014, డిసెంబరులో ఏర్పాటైంది. దీనిని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ప్రక్కనే నడక దూరంలో ఉన్న రివాయ్ గ్రామంలో లివింగ్ రూట్ బ్రిడ్జిలు ఉన్నాయి. మేఘాలయలోని ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలు డబుల్ డెక్కర్ బ్రిడ్జిలు, సింగిల్ డెక్కర్ బ్రిడ్జిల రూపంలో ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చిరపుంజి నుండి లివింగ్ రూట్ బ్రిడ్జి చేరేందుకు ట్రెక్కింగ్ చెయ్యటం ఒక సాహసం. దీనికి ధైర్యం, శక్తి రెండూ అవసరమే. ట్రెక్కింగ్ ద్వారా వెళ్లలేనివారు కొండమార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరవచ్చు.ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలు ప్రకృతిలోనే సహజంగా బలమైన వేళ్లు పెనవేసుకునిపోయి (బ్రిడ్జి) వంతెనల రూపాన్ని సంతరించుకుని ఇక్కడి వాగులు పైన ఏర్పడ్డాయి.

P3052698-EFFECTS

కొన్ని బ్రిడ్జిలు సుమారు 100 అడుగుల పొడవు కలిగి ఉంటాయి. ఇంత పొడవు కలిగిన (బ్రిడ్జి)వంతెన  పూర్తిగా తయారయేందుకు పదిహేనేళ్ల దాకా పడుతుంది. ఒకసారి పూర్తిగా తయారైన (బ్రిడ్జి)వంతెన ఒకేసారి దాదాపు యాభై మంది బరువును తట్టుకోగలిగిన శక్తిని కలిగి ఉంటుంది. ఈ వేళ్లు జీవశక్తితో నిరంతరం పెరుగుతూనే…

View original post 560 more words

ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part II

ద్వైతాద్వైతం

* * *

Continued from Part I

గౌహతిలో గడిపిన సమయంలో ఒక అస్సామీ స్నేహితురాలు నీషాడేకా ని కలిసాను. ఆమె ఒక గాయని. మధ్య తరగతి మహిళ. ఆమె భర్త ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. మనవైపు ప్రాంతాల్లో  అలాటి హోదాలో ఉండే వ్యక్తులకంటే చాలా సాదా సీదాగా కనిపించారాయన. అది వ్యక్తిగతమనే కాక అక్కడివారి జీవన విధానాన్నిసూచిస్తోందనిపించింది.

నేను చూసిన దాదాపు పది స్థానిక కుటుంబాల్లో ఒక్కరే సంతానం. అబ్బాయి లేదా అమ్మాయి ఎవరో ఒకరే. ఎవరైనా సరే బాగా చదివించుకోవాలన్న ఆలోచన ఉంది. పిల్లల్ని పెద్ద చదువుల కోసం, ఉద్యోగాలకోసం దూరంగా పెద్ద,పెద్ద నగరాలకి పంపించే ఆలోచనలో ఉన్న తల్లితండ్రులు చాలామందే కనిపించారు. అక్కడి స్థిరత్వంలేని వాతావరణం దీనికి కొంత కారణం అనిపించింది.

నీషా ని నేను కలిసినప్పుడు మొదటిసారిగా అడిగిన ప్రశ్న ‘ఆడపిల్లకి అక్కడ సమాజం ఎలాటి అవకాశాల్ని స్థానాన్ని కలిపిస్తోంది’ అని.

నీషా వాళ్ల అమ్మమ్మ కాలంలో ఆడపిల్లకి చదువులు లేవని, బాల్య వివాహాలు ఉండేవని, ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు ఆడపిల్లకి చక్కని చదువు, కెరియర్ ని అందిస్తున్నారని, ఆతర్వాతే పెళ్లి అని చెప్పిందామె.

OLYMPUS DIGITAL CAMERA

‘2015 జనవరి నెలలో అస్సాం ముఖ్యమంత్రి ఆడపిల్లలకి ప్రోత్సాహకాల్ని ప్రకటించారు కదా, అలాంటిది ఎందువల్ల అవసరం అయిందని’,  అడిగినప్పుడు , గౌహతి నగరం కాక మారుమూల ప్రాంతాల్లో,గిరిజనుల్లోని వివిధ తెగల్లో అవిద్య ఎక్కువగా ఉందని…

View original post 1,506 more words

ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part I

ద్వైతాద్వైతం

* * *

దైనందిన జీవితాల్లోంచి బయటకు వచ్చి మనం నివసించే ప్ర్రాంతానికి దూరంగానో, దగ్గరగానో ఉన్న క్రొత్త  ప్రదేశాలను చూసేందుకు మనలో చాలామంది ఆసక్తితో ఉంటాం. ఆ ప్రయాణాలు మొదలుపెట్టినప్పటినుండి తిరిగి ఇల్లు చేరేవరకు అనేక సంఘటనలు, సన్నివేశాలు ,అనేకానేక క్రొత్త వ్యక్తులు మనకు ఎదురై జీవితానికి క్రొత్త శక్తిని, ఉత్సాహాన్నిఇస్తాయి. అలాటి ఒక యాత్రలో ప్రకృతి ఒడిలోకి నేరుగా వెళ్లగలిగినప్పుడు ఆ యాత్ర పొడవునా మనం మనం కాకుండా పోతాం, తిరిగొచ్చేక మనజీవితం మనకళ్లకి కొత్త అందాలతో కనిపిస్తుంది.క్రొత్త అర్థాలను చెబుతుంది కూడా.  ఇవన్నీ ఏ ఒక్కరికో పరిమితమైన భావనలు కావు. మనమంతా ఎప్పుడో ఒకప్పుడు ఇలాటి అనుభవాన్ని, అనుభూతులను పొందే ఉంటాం.

అలాటి విలువైన అనుభవాన్ని ఇచ్చిన ఒక యాత్ర గురించి ఇప్పుడు చెబుతాను. ఈ ప్రాంతం మనదేశంలోనే చాలా చాలా ప్రత్యేకమైనది.  భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను మొదటిసారిగా చూసేందుకు వెళ్తూ వారానికి ఒకసారి నడిచే చెన్నై-గౌహతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నాం. అది ఎయిర్ కన్డీషన్డ్ రైలు. పాంట్రీ కారు కూడా ఉంది . ప్రయాణంలో చదువుకుందుకు ఇష్టమైన పుస్తకాలు ఉన్నాయి. సుదీర్ఘమైన రైలు ప్రయాణాలు అంటే మరింత ఇష్టం ఉంది. ఇక ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చెప్పక్కర్లేదుకదా.

ఈశాన్య రాష్ట్రాల వైపు బయలు దేరుతున్నామని చెప్పినప్పుడు కొందరు స్నేహితులు భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లటం సాహసం అవుతుందని, ఆ ప్రాంతాల్లో చేతిలో…

View original post 1,115 more words

నాందేడ్ – గోదావరి – గురుద్వారా

ద్వైతాద్వైతం

* * *

ఈ మధ్య మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఉన్న గురుద్వారా గురించి విని అక్కడికి వెళ్లేం. చాలా పెద్ద పట్టణం. విశాలమైన వీధులు. దాదాపు ఆరు లక్షల పైగా జనాభా ఉంది. ఇది మహారాష్ట్రలో 8వ పెద్ద పట్టణంగా చెబుతారు. నాందేడ్ పట్టణానికి ఉత్తరంగా గోదావరి నది ప్రవహిస్తూ ఉంది.

*

OLYMPUS DIGITAL CAMERAఅన్ని ప్రధాన కూడళ్లలోనూ ‘ సైలెంట్ సిటీ- బెటర్ సిటీ- సే నో టు హార్న్’ అన్న బోర్డులు కనిపించాయి. వాటిని చూసి ఆశ్చర్యపోలేదు కానీ ముచ్చటగా ఆ మాటలని అమలులో పెడుతున్న అక్కడి ప్రజల్ని చూసి అక్కడున్న రెండు రోజులూ తెగ ఆశ్చర్య పోయాను ఎందుకంటే, మన జనానికి ఏదైనా ఒక నియమం ఉంటే అది తోడే దాకా ( అంటే అది అతిక్రమించేసే దాకా) తోచదు కదా.  ఒక సరదా అనండి, లేదా ఒక కొంటెతనం అనండి. ఏమవుతుందో చూద్దాం అనే కుతూహలం కూడా కావచ్చు. ఈ విధమైన ధోరణి చాలా చోట్ల చూస్తూనే ఉంటాం.  కానీ దానికి భిన్నంగా కనిపించిందీ పట్టణం. అదే అంటే వేదాంతిలా నవ్వేడు మా క్యాబ్ డ్రైవర్. నా అభిప్రాయాన్ని ఒప్పుకోలేనన్న అతని అభిప్రాయం అర్థమైంది. అతను అక్కడి వాడు కనుక ఆ విషయం నాకంటే స్పష్టంగా ఎరిగున్నవాడే మరి.

ఈ శబ్ద కాలుష్యం లేకపోవటం పూణే నగరాన్ని జ్ఞాపకం తెచ్చింది. అక్కడ ఇలాటి బోర్డులు లేకపోయినా…

View original post 657 more words