* * *
అమృతసర్ నుండి రోడ్డు దారిలో ఒక వెహికల్ తీసుకుని హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాలకు బయలుదేరాం. ఇది 200 కిలోమీటర్ల దూరం. నాలుగైదు గంటల ప్రయాణం బావుంటుంది. నేషనల్ హైవే 54, 154 మీదుగా ప్రయాణం చేశాం. 1971 సంవత్సరంలో భారతదేశపు 18 వరాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది.
భారత దేశ పటంలో పశ్చిమ హిమాలయ శ్రేణుల్లో దౌలధర్ పర్వత పాదాల చెంత ఉన్నచిన్నరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. దీనికి ఉత్తరంగా జమ్ము, కాశ్మీర్, వాయవ్యంగా హర్యానా, పశ్చిమంగా పంజాబ్, తూర్పున టిబెట్ స్వతంత్ర ప్రాంతం ఉన్నాయి. హిమం అంటే మంచు, అచలమంటే పర్వతం. రాష్ట్రం అంతా ఆవరించి ఉన్న కొండలు, వాటిపైన మెరిసే మంచుతో ఈ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఈ రాష్ట్రం ప్రకృతి అందాలకు, వేసవి విడుదులకు, హిందూ దేవాలయాలకు ప్రసిధ్ధి. 2005 సంవత్సరం సర్వే ప్రకారం దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ తరువాత ఈ రాష్ట్రం రెండవది. ఈ రాష్ట్రానికి రెండు ముఖ్య పట్టణాలున్నాయి. వేసవి ముఖ్య పట్టణం సిమ్లా. శీతాకాలం ముఖ్య పట్టణం ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్ అంటే వేసవి విడుదులైన సిమ్లా, మనాలి, కులు, చంబ, డల్హౌసీ, ధర్మశాల వంటి ప్రాంతాలు మన మనస్సుల్లో కదులుతాయి.
*
హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం రియో పుర్గ్యిల్ 6816 మీటర్ల ఎత్తున ఉంది. చీనాబ్…
View original post 1,241 more words