* * *
Continued from Part III
ప్రొద్దున్న 7.30 నుండి 10.30 వరకూ అనేక జీప్ సఫారిలు సందర్శకుల సంఖ్యను బట్టి వరుసగా బయలుదేరుతాయి. ఏనుగు సఫారి మాత్రం రోజుకు రెందు ట్రిప్ లు . ప్రొద్దున్న 5.15, 6.15 సమయాల్లో బయలుదేరుతాయి. ఒక గంట పాటు ఈ సఫారి సాగుతుంది. దీనికి చాలా డిమాండ్ ఉంది. ఒక్కో ఏనుగు మీద నలుగురు మాత్రమే ఎక్కే వీలుంది. టికెట్లు దొరకటం కొంచెం కష్టమే. మరుసటి రోజుకి కావాలంటే మాత్రం దొరకవు. ముందుగా వి.ఐ.పి. లకి, విదేశీ సందర్శకులకీ టికెట్లకోటా ప్రకారం అమ్మేస్తారు. మిగిలినవి కూడా అక్కడ కొందరు ముందుగా కొని బ్లాక్ లో అమ్మటం ఉంది. ఒక్కక్కరికి నాలుగు టికెట్లు ఇస్తారు. టికెట్టు ధర 425 రూపాయలు .ఏనుగు సఫారికి వెళ్ళాలంటే రెండురోజులు ముందుగా అక్కడికి చేరటం లేదా ఎవరిద్వారానైనా ముందుగా బుక్ చేసుకోవటం చెయ్యాలి.
జీప్ సఫారీకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు ఇసుకతో ఎగుడుదిగుడుగా అసౌకర్యంగా అనిపించాయి. వాటిని మరికాస్త సౌకర్యంగా మలచి సఫారీని మరింత సుఖవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది.
జీప్ సఫారీ సమయంలో కళ్ల ఎదుటే రైనోలు తాపీగా నడిచి రోడ్ దాటడం చూసేము. ఈ సఫారీ దాదాపు మూడు గంటల సమయం పట్టింది.
ఈ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి రెండు నెలల కాలంలో ఇక్కడ 20 రైనోలను పోచర్లు చంపివేసారు. ఇలాటి సంఘటనల వలన…
View original post 536 more words