* * *
ఎప్పటిలాగే దేశంలో మరో క్రొత్త ప్రదేశాన్ని చూసేందుకు బయలుదేరాలనుకుంటుంటే ఒక పంజాబీ మిత్రుడు తాను స్థిరపడిన బరేలీ రమ్మని ఆహ్వానించారు. ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తున్న ప్రయాణానికి వేసవి విడిది నైనితాల్ ని కూడా కలుపుకుని నాలుగు రోజులు యాత్రని సిధ్ధం చేసుకున్నాం.
ముందుగా విజయవాడ నుంచి ఆకాశదారిలో దిల్లీ చేరి, అక్కడొక రోజు మజిలీ చేసేం. ఏప్రిల్ నెల మూడో వారం దిల్లీ నగరమింకా వేసవి వేడిని ఆహ్వానించినట్టులేదు. వాతావరణం బావుంది. ఆ శుక్రవారం సాయంత్రం దిల్లీలో గడిపిన పాత రోజుల్ని దిగులు, దిగులుగా తలుచుకుంటూ తీరిగ్గా జమా మసీదును చూసేందుకు బయల్దేరేం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన ఈ మసీదు భారతదేశంలోని ప్రసిధ్ధి చెందిన మసీదుల్లో ఒకటి. విశాలంగా కొన్ని వేలమంది సరిపోయేంత ఆవరణలో ఉన్న ఈ మసీదు అందమైన ఎర్రరాయి, తెల్లని పాలరాయి మేళవించి కట్టిన నిర్మాణము. ఆవరణలో పెద్దలు, పిల్లలు ఆనందంగా తిరుగాడుతూ కనిపించారు. ఆనందంతో వెలిగే ముఖాలు చూస్తుంటే ఎంత బావుంటుంది!
మసీదు ముందు అనేక చిన్న చిన్న దుకాణాలు బట్టలు, గాజులు, క్లిప్పులు, బొమ్మలు, బ్యాగ్ లు, పాదరక్షలు, ఇంకా అనేకరకాల వస్తువుల్ని అమ్మేందుకు సిధ్ధంగా ఉన్నాయి. చిన్నచిన్న పిల్లలు కూడా దుకాణాల్లో వ్యాపారం చేస్తూ కనిపించారు. ఎదగడానికి తొందరలేకపోయినా, జీవితం బలవంతంగా నేర్పుతున్న జీవిత పాఠాల్ని అనాయాసంగానే అందుకుంటున్నారు.
మరోప్రక్క రకరకాల తినుబండారాలను తయారు చేసే దుకాణాలు హడావుడిగా కనిపించాయి.
View original post 859 more words