ఢిల్లీ కబుర్లు – ఎనిమిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Dec. 2018

ద్వైతాద్వైతం

* * *

జరిగిన కథ: ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరికి వచ్చాడు. అక్కడ దావీద్, చిట్టి వాడికి స్నేహితులయ్యారు. తాతయ్య దావీద్‌కు చదువు చెప్పిస్తున్నారు.
రచన: అనురాధ నాదెళ్ళ, పోరంకి, కృష్ణాజిల్లా.

తాతమ్మకి నిద్ర వస్తున్నట్టు ఉంది, అయినా కబుర్లు వినాలన్న ఆశతో, ‘ఓ కప్పు కాఫీ ఇవ్వవే మణీ’ అంటూ కోడల్ని పురమాయించింది. ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాల గురించి బిట్టు అనర్గళంగా చెబుతూంటే నోళ్ళు తెరిచి వింటూ ఉండి పోయారు పిల్లలు. తాతమ్మకి కాఫీ, దాంతో పాటు పిల్లలకి కాసిని జంతికలు, రవ్వలడ్లు తెచ్చిపెట్టింది అమ్మమ్మ. బిట్టు ఉత్సాహంగా తన ఊరి విశేషాలు చెబుతున్నాడు. వాడి మాటలు వింటూ “వీడు వచ్చినప్పుడు తెలుగు రానట్లు ఎట్లా ఉన్నాడు, ఈ కొద్ది రోజుల్లోనే ఎంత మారిపోయాడు?! మాతృభాషకు నిజంగానే మనసు లోపల గట్టి ముద్ర ఉంటుందేమో, కాలం ప్రభావం వల్ల ఎంత మరుగు పడ్డా, తగిన సమయం రాగానే అది చకాలున బయటికి వచ్చేస్తుందేమో” అని ఆలోచనలో పడింది అమ్మమ్మ.

ఆలోగా బిట్టు ‘ఇందిరా గాంధీ మ్యూజియం’ గురించి చెప్పసాగాడు: ప్రియదర్శిని చిన్నప్పటి కథల దగ్గరినుండి, ఆవిడ పెద్దయి, హత్యకి గురైన రోజు వరకు అనేక సంగతులు చెప్పాడు వాడు. “ఆవిడ హత్య చేయబడినప్పుడు వేసుకున్న చీరను అలాగే రక్తపు మరకలతో మ్యూజియంలో ఉంచారు తెలుసా?” అని వాడు అడిగితే చిట్టి, దావీదు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. “ఆవిడ…

View original post 744 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.