* * *
జరిగిన కథ: బిట్టు ఢిల్లీలో ఉంటాడు వాళ్ల అమ్మా నాన్నలతో పాటు. సెలవల్లో వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరికి వచ్చాడు. ఇక్కడ తెలుగు నేర్చుకున్నాడు; దావీద్, చిట్టిలతో స్నేహం చేసాడు; ఆ పిల్లల ఇళ్ళలోని కష్టసుఖాలను తెలుసుకుంటూ ఎదుగుతున్నాడు…
రచన : అనురాధ నాదెళ్ళ, పోరంకి, కృష్ణాజిల్లా.
చిత్రాలు: సుహాసిని, 7వ తరగతి, రాధ స్కూల్ ఆఫ్ లర్నింగ్, అనంతపురం

బిట్టు వచ్చి ఇన్ని రోజులైనా వాడు అమ్మ-నాన్నల గురించి పెద్దగా అడగటం లేదు. నాలుగు రోజులకు ఒకసారి తాతయ్య వాడి చేత అమ్మ-నాన్నలకు ఫోను చేయిస్తున్నారు. ఆ నాలుగు రోజుల్లో జరిగిన కబుర్లన్నీ వరస పెట్టి వాళ్లకి చెప్పేస్తూ ఉంటాడు బిట్టు. ‘ఇన్ని కబుర్లు ఎప్పుడు నేర్చుకున్నాడమ్మా వీడు? ఇంట్లో ఎప్పుడూ ఇంతగా మాట్లాడడు?!’ అన్నది సునంద, తల్లితో.
‘అక్కడ ఇంట్లో ఎవరుంటారమ్మా, వాడి కబుర్లు వినేందుకు? ఇక్కడైతే నలుగురితో కలిసి మెలిసి తిరుగుతాడు. అసలు నీకు తెలీదుగానీ, వాడి పొట్టనిండా కబుర్లే! తాతమ్మకి కొత్త కొత్త కబుర్లు చెబుతాడు; ఢిల్లీ వింతలన్నీ ఇక్కడ వాడి స్నేహితులకి చెబుతాడు..’

తల్లి మాటలు వింటుంటే సునందకి సంతోషం కంటే ఎక్కువ దిగులుగా అనిపించింది- ‘ఇక్కడ తను, శివ ఇద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాడు చెప్పేది ఇద్దరూ సరిగ్గా వినరు. ఇంట్లో వాడికి ఒక్క తోడు కూడా లేకుండా ఒంటరిగా పెంచుతున్నారు. ఏదో ఈ సెలవల పుణ్యమా అని…
View original post 738 more words