* * *
నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కదా, చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఇక ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి. ‘వాళ్ళు చదువుకోవాలి’ అని వీరబాబు కోరిక. ఇక చదవండి..

మొదటి రోజు దావీదు అయిష్టంగానే వచ్చాడు. వాడు వీరబాబుతో చెప్పాడుట, ‘నేను సైకిల్ పని బాగా నేర్చుకుని, పెద్ద కొట్టు పెట్టుకుంటాను, చదువొద్దు’ అని.
‘కానీ చదువు ఎందుకు అవసరం’ అని బిట్టు వాళ్ల తాతయ్య వివరంగా చెప్పారు అందరికీ: “ఏ పని చేసినా కొంచెం చదువు, కొంచెం ఆలోచన ముఖ్యం. ఆ కొంచెం చదువు కూడా లేకపోతే ఆలోచించే శక్తి సరిగ్గా రాదు. అంతేకాదు, ఈ రోజుల్లో చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది; జీవితం బావుంటుంది. మరొకరికి సాయం చేసే అవకాశం ఉంటుంది కూడా” అని. పిల్లలు ముగ్గురూ బుద్ధిగా విన్నారు.
తాతయ్య చెబుతుంటే మెల్ల మెల్లగా తెలుగు అక్షరాలు నేర్చుకోవటం మొదలెట్టారు బిట్టు, దావీదు. అప్పటికే చిట్టికి తెలుగు చదవటం, రాయటం వచ్చు బాగానే. అందుకని ఇప్పుడు తను వీళ్ళతోబాటు కూర్చొని ఇంగ్లీషు అక్షరాలు, హిందీ అక్షరాలు మొదలెట్టింది.
కొన్ని రోజులు గడిచే సరికే చాలా మార్పు వచ్చింది. పిల్లలిద్దరికీ కూడా చిన్న చిన్న పదాలు చదవటం వస్తోంది ఇప్పుడు. తాతయ్య రోజూ వాళ్లకి…
View original post 898 more words