* * *
ఈ సంవత్సరం కూడా ఎటైనా వెళ్లి రావాలని, ఏదైనా క్రొత్త ప్రదేశం చూడాలని ప్రయాణం పెట్టుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నధర్మశాల చూడాలని ఆశ. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి దలైలామా వచ్చి వెళ్లారు. మా ఆశ మరింత బలపడింది. అంత దూరం వెళ్తున్నాం కదా మరోసారి అమృతసర్ కూడా చూద్దామని ముందుగా అక్కడకి బయలుదేరేం. విజయవాడ నుంచి దిల్లీ వరకూ పొద్దున్న 9 గంటల ఫ్లైట్ పట్టుకుని దిల్లీ చేరేసరికి 11.30 అయింది. మార్చి నెల పగటి ఉష్ణోగ్రతలు గట్టిగా ఉన్నాయని చెబుతున్నా, విశాలమైన విమానాశ్రయంలోంచి బయటకొచ్చి నిలబడేసరికి చల్లని గాలి చురుక్కున తగిలింది.
ఐదారేళ్ల క్రితం అక్కడున్న రోజుల్ని తలుచుకుంటూ స్నేహితులతో కాసేపు గడిపి, సాయంత్రం అమృతసర్ వెళ్లే శతాబ్ది అందుకుందుకు న్యూదిల్లీ స్టేషన్ చేరేం. నగరంలో పెద్దగా మార్పు లేదు. అదే ట్రాఫిక్ జామ్, వాహనాలు చేసే శబ్ద కాలుష్యం దిల్లీ ప్రజల అసహనం గురించి చెబుతూ, అక్కడి పొల్యూషన్ ని మరింత పోగుచేస్తోంది. దేశ రాజధాని వాసులు మిగిలిన దేశంలోని ప్రజల కంటే మరింత విశిష్టమైన వారు కాబోలు మరి. అక్కడ రోడ్ ట్రాఫిక్ నుండి విముక్తి మాత్రం ఒక్క మెట్రో రైలు ప్రయాణమే. కేజ్రీవాల్ పరిపాలన గుర్తు చేసుకుని చుట్టూ పరికించాను.
న్యూదిల్లీ స్టేషన్ లో చెత్తా చెదారం, అశుభ్రం అలాగే ఉంది. రైల్వే వారు నడుపుతున్న భోజన శాల బయట…
View original post 1,204 more words